శిల్పారామాలకు పరిపాలనా అనుమతులు జారీ

3 Oct, 2020 13:00 IST|Sakshi

సాక్షి, అమరావతి: శ్రీకాకుళం, తిరుపతిలలో శిల్పారామాల నిర్మాణానికి, నిధుల వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. శిల్పారామాల అభివృద్ధితో పాటు వివిధ నిర్మాణాల కోసం 10 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. శ్రీకాకుళంలో కొత్త శిల్పారామం ఏర్పాటుకు పర్యాటక, సాంస్కృతిక శాఖ తొలివిడతగా 3 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఈ సందర్భంగా తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మాణాలు చేపట్టాల్సిందిగా ప్రభుత్వం సూచనలు చేసింది.  (టీడీపీలో అసంతృప్తి సెగ: అలిగిన శిరీష)   

మరిన్ని వార్తలు