ఏపీలో కొత్తగా 1‌‌0,413 కరోనా కేసులు

4 Jun, 2021 16:54 IST|Sakshi

అమరావతి: గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 85,311 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1‌‌0,413 కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. అదే విధంగా, కరోనా కారణంగా 83 మంది మరణించారు. కాగా, గత 24 గంటల్లో ఈ మహమ్మారి బారినుండి 15,469 మంది  కోలుకున్నారు.  ఏపీలో ప్రస్తుతం 1,33,773 కేసులు ఆక్టివ్​గా ఉన్నాయి. ఇప్పటి వరకు ఏపీ రాష్ట్రంలో మొత్తంగా.. 15 లక్షల 93 వేల 921 మంది కరోనా నుండి కోలుకుని  డిశ్చార్జ్‌ అయ్యారు.

ఇప్పటి వరకు ఏపీలో 1,96,19,590 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.  ఈమేరకు ఏపీ రాష్ట్రవైద్యారోగ్య శాఖ శుక్రవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. 

మరిన్ని వార్తలు