అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతుంది. గత వారం రోజులుగా రోజువారీ కేసుల సంఖ్య తగ్గడంతోపాటు, రికవరీల రేటు పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 88,378 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 3,042 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 28 మంది మృత్యువాతపడ్డారు.
దీంతో మొత్తం మరణాల సంఖ్య 12,898 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 3,748 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 18 లక్షల 61 వేల 937 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 33,230 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,90,8065 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,25,24,187 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.