Corona Virus: ఏపీలొ కొత్తగా 2,145 కేసులు..

5 Aug, 2021 17:36 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా ఉధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 82,297 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,145 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 24 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,468 కు చేరింది. 

గడిచిన 24 గంటల్లో 2,003 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 19,42,371 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 20,302 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,76,141 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు  2,49,46,265 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు