Corona Virus: ఏపీలో కొత్తగా 1,506  కరోనా కేసులు

15 Aug, 2021 17:28 IST|Sakshi

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 65,500 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,506 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 16  మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,647 కు చేరింది. 

గత 24 గంటల్లో 1,835 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు  19,62,185 మంది ఏపీలో డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ  ఆదివారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 17,865 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,93,697 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,56,61,449  కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

>
మరిన్ని వార్తలు