Corona Virus: ఏపీలో కొత్తగా 1,186  కరోనా కేసులు

1 Sep, 2021 17:32 IST|Sakshi

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 56,155 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,186 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 10  మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,867 కు చేరింది. 

గత 24 గంటల్లో 1,396 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు  19,86,962 మంది ఏపీలో డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ  బుధవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 14,473 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,15,302 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,66,85,469  కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

చదవండి: భారత్‌లో కొత్త వేరియంట్‌ వస్తేనే థర్డ్‌వేవ్‌!

మరిన్ని వార్తలు