ఏపీలో కొత్తగా 381  కరోనా కేసులు

28 Oct, 2021 19:02 IST|Sakshi

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 38,896 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 381 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా ఒక్కరు మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 14,365 కు చేరింది. 

గత 24 గంటల్లో 414 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు  20,46,127 మంది ఏపీలో డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ  గురువారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 4743 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,65,235 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,94,04,281  కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు