కరోనా కల్లోలం: ఏపీలో తాజాగా 11,766 కేసులు..

23 Apr, 2021 18:57 IST|Sakshi

అమరావతి: గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 45,581 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 11,766 మందికి పాజిటీవ్‌గా నిర్థారణ అయ్యింది. అదే విధంగా, కరోనా వలన  ఏపీలో 38 మంది మరణించారు. కాగా, గత 24 గంటల్లో ఈ మహమ్మారి బారినుండి 4,441 మంది క్షేమంగా కొలుకున్నారు.  ఇప్పటి వరకు ఏపీలో మొత్తంగా..  9 లక్షల 27వేల 418 మంది కరోనా నుండి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అయ్యారు.

ప్రస్తుతం 74,231 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు ఏపీలో 1,58,80,750 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈమేరకు ఏపీ రాష్ట్రవైద్యారోగ్య శాఖ శుక్రవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. 

చదవండి: ఏపీలో ఉచితంగా వ్యాక్సిన్‌

మరిన్ని వార్తలు