ఏపీ : 4 బిల్లులకు గవర్నర్ ఆమోదం

23 Dec, 2020 20:28 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఆమోదించిన 4 బిల్లులకు గవర్నర్ బిశ్వభూషన్‌ హరిచందన్‌ ఆమోదం తెలిపారు. గవర్నర్‌ ఆమోదం తెలిపిన బిల్లులతో ఫిష్‌ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ బిల్లు, వ్యవసాయ భూముల మార్పిడి సవరణ బిల్లు, స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ బిల్లు, ఎఫ్‌ఆర్‌బీఎం సవరణ బిల్లు ఉన్నాయి. గవర్నర్‌ ఆమోదంతో ఈ నాలుగు బిల్లులు చట్టాలుగా మారాయి. గవర్నర్ పేరిట రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసింది.

మరిన్ని వార్తలు