ప్రధానితో ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ భేటీ

24 Apr, 2022 08:48 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ శనివారం ఢిల్లీలో ప్రధాని మోదీతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ నెల 26 వరకు ఢిల్లీలోనే ఉండనున్న గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆదివారం ఉదయం వార్‌ మెమోరియల్‌ను సందర్శించనున్నారు. సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను గవర్నర్‌ కలిసే అవకాశముంది.
చదవండి👉: రైళ్లకు సమ్మర్‌ రష్‌..! 

మరిన్ని వార్తలు