ప‌టేల్‌కు నివాళులు అర్పించిన ఏపీ గ‌వ‌ర్న‌ర్

31 Oct, 2020 15:15 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఏపీ రాజ్ భవన్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ 145 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూల మాలవేసి గవర్నర్ విశ్వ‌భూష‌ణ్ హరిచందన్ నివాళులు అర్పించారు. సువిశాల భారతావనికోసం వల్లభాయ్ పటేల్ చేసిన కృషి ఎనలేనిదని గవర్నర్ కొనియాడారు. మహనీయుని సేవలు ఎప్పటికీ గుర్తుండి పోతాయన్నారు . 

మరిన్ని వార్తలు