సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. మంగళవారం నగరంలోని కొత్త ప్రభుత్వాసుపత్రిలో గవర్నర్ దంపతులు కోవాగ్జిన్ టీకా వేయించుకున్నారు. అనంతరం బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ, కోవిడ్-19ను ఎదుర్కోవడంలో వైద్య సిబ్బంది సేవలు అభినందనీయమన్నారు. రాత్రింబవళ్లు టీకా కనుగొనేందుకు కృషి చేసిన శాస్తవేత్తలను ఆయన ప్రశంసించారు. అర్హులైన వారంతా టీకాలు వేయించుకునేందుకు ముందుకు రావాలన్నారు. వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని గవర్నర్ పేర్కొన్నారు.
చదవండి:
‘మారిటైమ్ ఇండియా’ సదస్సులో పాల్గొన్న సీఎం జగన్
విషాదం: అమ్మకు తోడుగా వచ్చి..