నేషనల్‌ వార్‌ మెమోరియల్‌ను సందర్శించిన ఏపీ గవర్నర్‌

24 Apr, 2022 12:14 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. నేషనల్‌ వార్‌ మెమోరియల్‌ను గవర్నర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా అమరవీరులకు ఆయన నివాళులర్పించారు. సోమవారం.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో గవర్నర్‌ భేటీ కానున్నారు. మంగళవారం విజయవాడ రాజ్‌భవన్‌కు గవర్నర్‌ చేరుకోనున్నారు. కాగా, గవర్నర్‌ బిశ్వభూషణ్‌.. శనివారం ఢిల్లీలో ప్రధాని మోదీతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం.
చదవండి👉: మనసు ‘దోశ’కున్న మంత్రి వేణు 

మరిన్ని వార్తలు