చిన్న పత్రికలకు అక్రిడిటేషన్‌ నిబంధనల సవరణ

29 Aug, 2021 08:39 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిన్న పత్రికలకు అక్రిడిటేషన్‌ల మంజూరు నిబంధనలను ప్రభుత్వం సవరించింది. జీఎస్టీకి మినహాయింపునిస్తూ ఇతర నిబంధనలను పరిగణనలోకి తీసుకుని చిన్న పత్రికలకు అక్రిడిటేషన్‌లు మంజూరు చేయాలని పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ విజయకుమార్‌ రెడ్డి శనివారం ఉత్తర్వులిచ్చారు. చిన్న పత్రికలకు అక్రిడిటేషన్‌ల మంజూరు నిబంధనలు సవరించడం హర్షణీయమని ఏపీ ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ వెన్ను శనివారం పేర్కొన్నారు. 

చదవండి: పెదకాకానిలో అగ్రిగోల్డ్‌ ఆస్తులపై సీఐడీ విచారణ

మరిన్ని వార్తలు