తెలుగు అకాడమీ.. ఇకపై తెలుగు సంస్కృత అకాడమీ

11 Jul, 2021 08:58 IST|Sakshi

సాక్షి, అమరావతి: తెలుగు అకాడమీ పేరును తెలుగు సంస్కృత అకాడమీగా మారుస్తూ ఉన్నత విద్యాశాఖ శనివారం ఉత్తర్వులిచ్చింది. దీనికి నలుగురు సభ్యులతో గవర్నింగ్‌ బాడీని ఏర్పాటు చేసింది. ఎస్వీ వర్సిటీ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ డి.భాస్కరరెడ్డి, డా.రాజకుమార్‌ నేరెళ్ల, డా.ఎం.విజయశ్రీ, డా.కప్పనగంతు రామకృష్ణలను గవర్నింగ్‌ సభ్యులుగా నియమించింది. ఎక్స్‌ ఆఫీషియో మెంబర్‌గా పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఉంటారు. యూజీసీ నామినీగా తిరుపతి నేషనల్‌ సంస్కృత వర్సిటీ వీసీ మురళీధరశర్మను నియమించారు. 

మరిన్ని వార్తలు