AP: బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు శుభవార్త

6 Jun, 2022 17:09 IST|Sakshi

తాడేపల్లి:  ఏపీలో బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జూన్‌ 17లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఉద్యోగుల బదిలీల ఫైల్‌పై సీఎం వైఎస్‌ జగన్‌ సంతకం చేశారు.  దీనికి సంబంధించి త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. 

మరిన్ని వార్తలు