పీఆర్సీపై ఏపీ సర్కార్‌ కీలక ఉత్తర్వులు

1 Apr, 2021 20:14 IST|Sakshi

పీఆర్సీ అమలుకు కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

సాక్షి, అమరావతి: పీఆర్సీ అమలుకు కమిటీ ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీఆర్సీ ఛైర్మన్‌ నివేదికపై అధ్యయనానికి సీఎస్‌ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. సభ్యులుగా సీఎం ముఖ్యసలహాదారు, రెవెన్యూ, ఆర్థిక, జీఏడీ అధికారులను నియమించింది. ఆర్టీసీ విలీనంతో సిబ్బందికి పీఆర్సీ అమలుపై  కమిటీ చర్చించనుంది. పీఆర్సీ సిఫార్సులపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కమిటీకి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
చదవండి:
మన బాధ్యత మరింత పెరిగింది: సీఎం జగన్‌
తెలుగు రాష్ట్రాల్లో కలకలం: ఎన్‌ఐఏ సోదాలు

మరిన్ని వార్తలు