ముస్లిం ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం వెసులుబాటు

12 Apr, 2021 15:00 IST|Sakshi

సాక్షి, అమరావతి: రంజాన్‌ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. విధుల నుంచి గంట ముందుగా ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఏప్రిల్‌ 14 నుంచి మే 13 వరకు గంట ముందుగా ఇంటికి వెళ్లే అవకాశం కల్పించింది. రంజాన్‌ ఉపవాస దీక్షల సందర్భంగా వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం.. కోవిడ్‌ నిబంధనలతో రంజాన్‌ వేడుకలు నిర్వహించుకోవాలని సూచించింది.
చదవండి:
ఇ-వ్యవసాయం.. ఒక్క క్లిక్‌తో సమగ్ర సమాచారం  
హోంగార్డు భార్య మృతి కేసులో ట్విస్ట్‌

మరిన్ని వార్తలు