సంగం బ్యారేజీకీ మేకపాటి గౌతమ్‌రెడ్డి నామకరణం

12 Apr, 2022 18:22 IST|Sakshi

సాక్షి, అమరావతి: సంగం బ్యారేజీకీ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరును పెడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌గా నామకరణం చేశారు. గౌతమ్‌రెడ్డి అకాల మరణం అనంతరం గౌతమ్‌రెడ్డి గౌరవార్థం సంగం బ్యారేజ్‌కు ఆయన పేరును పెడతామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పలు సందర్భాల్లో ప్రకటించిన విషయం తెలిసిందే.
చదవండి: Medicine-Health: విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలే లక్ష్యం: సీఎం జగన్‌

మరిన్ని వార్తలు