సాక్షి, అమరావతి: సీఆర్డీఏ పరిధిలో భూమిలేని కుటుంబాలకు పింఛన్ చెల్లింపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. పింఛన్ చెల్లింపునకు రూ.30 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.