నిమ్మగడ్డ పిటిషన్‌పై విచారణ వాయిదా

12 Jan, 2021 17:46 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్‌ దుర్గాప్రసాద్, జస్టిస్‌ కృష్ణ మోహన్‌లతో కూడిన ధర్మాసనం.. ఎస్‌ఈసీ అభ్యంతరాలను తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని భావిస్తూ.. తదుపరి విచారణను ఈనెల 18కు వాయిదా వేసింది. కాగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకై ఎలక్షన్‌ కమిషన్,‌ ఈ నెల 8న జారీ చేసిన షెడ్యూల్‌ అమలును నిలిపివేస్తూ హైకోర్టు సోమవారం ఆదేశాలు ఇచ్చిన విషయం విదితమే. ఈ ఎన్నికల షెడ్యూల్‌ రాజ్యాంగంలోని అధికరణలు 14, 21లకు విరుద్ధమన్న న్యాయస్థానం... ఎస్‌ఈసీ ఆచరణ సాధ్యం కాని నిర్ణయం తీసుకుందని ఆక్షేపించింది.(చదవండి: నిమ్మగడ్డ మరో వివాదాస్పద నిర్ణయం)

అదే విధంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కరోనా వ్యాక్సినేషన్‌ బృహత్కార్యానికి విఘాతం కలిగిస్తుందని పేర్కొంటూ.. ఎస్‌ఈసీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని ఈ సందర్భంగా తప్పుబట్టింది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ.. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ హౌస్‌ మోషన్‌ రిట్ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు