ఆనందయ్య మందు పంపిణీపై హైకోర్టులో విచారణ

21 Jun, 2021 15:06 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆనందయ్య మందు పంపిణీపై ఏపీ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ప్రధానంగా ఆనందయ్య పంపిణీ చేసే చుక్కల మందుపై హైకోర్టులో విచారణ జరగ్గా, చుక్కల మందులో కంటికి హాని కలిగించే పదార్థముందని ప్రభుత్వ న్యాయవాది వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆనందయ్య పంపిణీ చేసే చుక్కల మందును  5 ల్యాబ్‌లలో పరీక్షించినట్లు తెలిపారు. కాగా, ల్యాబ్‌ల నివేదిక తమ మందు ఉంచాలని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణను జులై 1కి వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు