బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వ్యవహారంపై హైకోర్టులో విచారణ

16 Jul, 2021 12:20 IST|Sakshi

సాక్షి, అమరావతి: బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వ్యవహారంపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ధార్మిక పరిషత్‌ తీర్మానం నిబంధనలకు అనుగుణంగా లేదని హైకోర్టు తెలిపింది. టీటీడీ ఈవో సంతకం లేదు కాబట్టి తీర్మానం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.

మరిన్ని వార్తలు