రీ-నోటిఫికేషన్‌పై హైకోర్టులో విచారణ

5 Mar, 2021 12:35 IST|Sakshi

ఎంపీటీసీ, జెడ్పీటీసీ రీ-నోటిఫికేషన్‌పై హైకోర్టులో విచారణ

తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు

సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ రీ-నోటిఫికేషన్‌పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయడానికి ఎస్‌ఈసీ సమయం కోరారు. కోర్టు కేసులు ఉన్నాయని ఎస్‌ఈసీ ఆలస్యం చేస్తోందని ప్రభుత్వం తెలిపింది. కౌంటర్ దాఖలు చేయనందుకు కోర్టుకు ఎస్‌ఈసీ క్షమాపణ చెప్పారు. సోమవారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఎస్‌ఈసీ కౌంటర్ దాఖలు చేయనిపక్షంలో.. కౌంటర్‌ దాఖలు చేసినట్లుగానే భావించి విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణ హైకోర్టు.. సోమవారానికి వాయిదా వేసింది.


చదవండి:
చంద్రబాబు ఫ్లాప్‌ షో: టీడీపీలో నిరుత్సాహం
సిట్టింగ్‌లకు టీడీపీ షాక్‌.. జనసేనతో లోపాయికారి  ఒప్పందం! 

మరిన్ని వార్తలు