షెడ్యూల్‌‌ ప్రకారమే గ్రూప్‌-1 పరీక్షలు: హైకోర్టు

9 Dec, 2020 12:35 IST|Sakshi

సాక్షి, అమరావతి: గ్రూప్‌-1 పరీక్షలు వాయిదా వేయాలని ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో రిట్‌ దాఖలైన విషయం తెలిసిందే. అయితే గురువారం దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఆ రిట్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. గ్రూప్‌-1 పరీక్షలను షెడ్యూల్‌ ప్రకారమే కొనసాగించాలని హైకోర్టు ఉత్వర్వులు జారీ చేసింది. అయితే ఈ నెల 14 నుంచి గ్రూప్‌-1 పరీక్షలు నిర్వహించేందుకు గతంలో ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు