ఎమ్మెల్సీ డ్రైవర్‌ హత్యకేసును సీబీఐకి అప్పగించేందుకు హైకోర్టు నిరాకరణ

4 Jan, 2023 15:42 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసును సీబీఐకి అప్పగించేందుకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నిరాకరించింది. సీసీ ఫుటేజ్‌కి సంబంధించిన ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టును 15 రోజుల్లో తెప్పించుకోవాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది.

దర్యాప్తులో గుర్తించిన అంశాలతో అదనపు అభియోగపత్రం దాఖలు చేయాలని స్పష్టీకరించింది. మూడు నెలల్లో ఫైనల్‌ ఛార్జ్‌ షీట్‌ దాఖలు చేయాలని ఆదేశాలిచ్చింది. 

చదవండి: (నాడు కక్కుర్తి.. నేడు హైడ్రామా.. మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌ పాలి‘ట్రిక్స్‌’)

మరిన్ని వార్తలు