గ్రూప్‌-1 ఇంటర్వ్యూల నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ

15 Jun, 2022 11:18 IST|Sakshi

సాక్షి, అమరావతి: గ్రూప్‌-1 ఇంటర్వ్యూల నిలుపుదలకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నిరాకరించింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 15 నుంచి 29 వరకు యధాతథంగా ఇంటర్వ్యూలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు నియమకాలు కూడా జరుపుకోవచ్చు. అయితే నియామకాలు ఈ వ్యాజ్యాల్లో కోర్టు ఇచ్చే తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయి. పిటిషనర్ల సమాధాన పత్రాలను, మార్కుల వివరాలను సీల్డ్‌ కవర్లో కోర్టు ముందుంచాలని హైకోర్టు సర్వీస్‌ కమిషన్‌కి ఆదేశాలు జారీ చేసింది. 

చదవండి: (ప్రతీ దానికి పిల్‌ ఏంటి!?.. టీడీపీ ఎమ్మెల్యేకు ఏపీ హైకోర్టు చీవాట్లు)

మరిన్ని వార్తలు