AP Inter Results 2022: ఇంటర్ ఫ‌లితాలు విడుద‌ల‌.. డైరెక్ట్ లింక్ ఇదే..

21 Jun, 2022 23:23 IST|Sakshi

సాక్షి అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంట‌ర్మీడియ‌ట్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌ర ప‌రీక్ష‌ల ఫ‌లితాలు జూన్ 22వ తేదీ (బుధ‌వారం) విడుద‌లయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స‌ స‌త్య‌నారాయ‌ణ విజ‌య‌వాడ‌లో ఫలితాలను  విడుద‌ల‌ చేశారు.

కాగా, ఇంట‌ర్ జవాబు పత్రాల మూల్యాంకనం వేగంగా పూర్తి చేశారు. మే 6వ తేదీ నుంచి ఫస్టియర్, 7వ తేదీ నుంచి సెకండియర్‌ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఇంట‌ర్ ఫ‌లితాల‌ను సాక్షిఎడ్యుకేషన్‌.కామ్(www.sakshieducation.com)లో చూడొచ్చు.

10.01 లక్షల మంది విద్యార్థులు..
ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,456 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజ‌ర‌య్యారు. మే 24వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షలను ఏపీ ఇంటర్‌ బోర్డు పటిష్ట ఏర్పాట్లతో పూర్తిచేసింది. 

ఈ సారి ప‌రీక్ష‌ల‌ను..
పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో నెలకొన్న ఘటనలను దృష్టిలో పెట్టుకొని ఇంటర్‌ పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అధికారులు జాగ్రత్త ప‌డ్డారు. అలాగే పరీక్ష కేంద్రాల్లో అన్ని గదుల్లోనూ, బయట సీసీ కెమెరాలను అమర్చారు.

ఈ కెమెరాల ద్వారా పరీక్షల తీరుతెన్నులను రికార్డు చేయడంతోపాటు వాటన్నింటినీ ఇంటర్‌ బోర్డు కార్యాలయానికి అనుసంధానించారు. ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ ద్వారా బోర్డు అధికారులు పరీక్షలు జరుగుతున్న తీరును నిత్యం పరిశీలిస్తారు. జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక కమిటీలు ఇంటర్‌ పరీక్షలను పర్యవేక్షించారు.

మరిన్ని వార్తలు