నాడు-నేడుకు లారస్‌ ల్యాబ్స్‌ రూ.4 కోట్ల విరాళం

9 Jan, 2023 18:13 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విద్యామౌలిక సదుపాయాలను పెంపొందించడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టిన నాడు- నేడు కార్యక్రమానికి లారస్‌ ల్యాబ్స్‌ రూ.4 కోట్లను విరాళంగా అందించింది. దీంతోపాటు పారిశ్రామిక ప్రాంతం అయిన అనకాపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ప్రత్యేక వార్డు (కాలిన గాయాలకు సంబంధించిన) నిర్మాణానికి 5 కోట్ల రూపాయలు అందిస్తామని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ డా. సత్యనారాయణచావా.. సీఎం జగన్‌తో తెలిపారు.

నాడు- నేడు పథకం కింద లారస్‌ ల్యాబ్స్‌ విరాళాన్ని అందించడం ఇది మూడోసారి. ఈ సందర్భంగా సీఎంని కలిసిన వారిలో సీఈఓ డా.సత్యనారాయణ చావా, కార్పొరేట్‌ డెవలప్‌మెంట్, సింథసిస్‌ మరియు ఇంగ్రిడియంట్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కృష్ణచైతన్య చావా, మానవ వనరుల సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నరసింహారావు చావా, సీఎస్‌ఆర్‌ హెడ్‌ సౌమ్య చావా ఉన్నారు.

చదవండి: (సీఎం జగన్‌ చేతుల మీదుగా పాడి రైతులకు బోనస్‌ పంపిణీ)

>
మరిన్ని వార్తలు