తిరుపతి కోవిడ్‌ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి

6 Aug, 2020 12:00 IST|Sakshi

సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారిని ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ దర్శనంలో స్వామి వారిని దర్శించుకున్న అనంతరం మంత్రిని ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమలలో అల్పాహారం అనంతరం ఆయన తిరుపతి కోవిడ్‌ ఆసుపత్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైద్యులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. (రాజధాని నిర్ణయం రాష్ట్ర పరిధిలోనిదే: కేంద్రం)

దేశంలో ఎక్కడాలేని విధంగా మన రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు అధికంగా జరుగుతున్నాయని తెలిపారు. వేల కోట్ల రూపాయలు ఖర్చుఅవుతున్నా కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఆసుపత్రిలో కరోనా బాధితులకు అందుతున్న వైద్యసేవలపై సీఎం వైఎస్‌ జగన్‌ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు తిరుపతి కోవిడ్‌ ఆసుపత్రిని పరిశీలించానని తెలిపారు. అన్ని వార్డుల్లో తిరిగి, బాధితులతో వ్యక్తిగతంగా మాట్లాడానని పేర్కొన్నారు. స్విమ్స్‌లో వైద్యసేవలు చాలా బాగున్నాయని, మంచి ఆహారం అందిస్తున్నారని రోగులు చెబుతున్నారని మంత్రి ఆళ్ల  నాని వెల్లడించారు.

మరిన్ని వార్తలు