‘ప్రతి లే-అవుట్‌లో పండగ వాతావరణం కనపడుతుంది’

4 Jul, 2021 13:25 IST|Sakshi

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో జగనన్న ఇళ్ల నిర్మాణాలు ఒక యజ్ఞంలా జరుగుతున్నాయని ఏపీ గృహనిర్మాణ శాఖా మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిరుపేదల సొంతింటి కల సీఎం జగన్‌ వలన సాకారమైందని తెలిపారు.

ఏపీలోని ప్రతి లే-అవుట్‌లో పండగ వాతావారణం కనపడుతోందని, అదే విధంగా, పేదలకోసం.. 5 లక్షల 7 వేల ఇళ్లకు శంకుస్థాపనలు జరుగుతున్నాయని అన్నారు. అదే సమయంలో జగనన్న కాలనీల వలన చాలా మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుందని తెలిపారు. 

మరిన్ని వార్తలు