Corona Cases: ఏపీలో కొత్తగా 1,184 కేసులు

26 Sep, 2021 16:35 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,184 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 11 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. గత 24 గంటల్లో వైరస్‌ నుంచి 1,333 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు 20,19,657 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సం‍ఖ్య 14,136కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

చదవండి: చంటిబిడ్డలతో ప్రమాణ స్వీకారానికి..

మరిన్ని వార్తలు