సీఎం జగన్‌ను కలిసిన ఆదిత్యనాధ్‌ దాస్‌

23 Dec, 2020 11:28 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్న ఆదిత్యనాథ్‌ దాస్ బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఆదిత్యనాథ్‌ దాస్‌తో పాటు డీజీపీ గౌతం సవాంగ్‌ కూడా ఉన్నారు. కాగా ప్రస్తుత సీఎస్‌ నీలం సాహ్ని ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. అదే రోజు నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్‌ దాస్‌ బాధ్యతలు స్వీకరిస్తారు. (నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్‌ దాస్)


 

మరిన్ని వార్తలు