ఆగిపోయిన చోట ఎన్నికల నిర్వహణపై కసరత్తు

24 Sep, 2021 08:47 IST|Sakshi

ఎస్‌ఈసీతో ద్వివేది, గిరిజాశంకర్‌ భేటీ  

సాక్షి, అమరావతి : వివిధ కారణాలతో సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఆగిపోయిన చోట తిరిగి నిర్వహించే అంశంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ దృష్టి పెట్టింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలంసాహ్ని గురువారం పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజా శంకర్‌లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో నీలంసాహ్నితో భేటీ అయ్యారు. ఎన్నికలు ఆగిపోయిన స్థానాల వివరాలు అందజేశారు. తిరిగి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై చర్చించినట్లు తెలిసింది.  
 

మరిన్ని వార్తలు