సాక్షి, అమరావతి: కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి బృందం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశం అయ్యింది.
బుధవారం సాయంత్రం.. క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్తో కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహూజా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన సీఈవో, సంయుక్త కార్యదర్శి రితేష్ చౌహాన్, కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.సునీల్, నోడల్ ఆఫీసర్ అజయ్కరన్లతో కూడిన బృందం భేటీ అయ్యింది.
ఈ భేటీకి వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్ధ వీసీ అండ్ ఎండీ జి శేఖర్ బాబు హాజరు అయ్యారు. ఏపీకి సంబంధించి కీలకాంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.