YSR Bima: హైదరాబాద్‌ వెళ్లి.. వైఎస్సార్‌ బీమా నమోదు

27 Jun, 2021 04:51 IST|Sakshi
హైదరాబాద్‌ వెళ్లి వైఎస్సార్‌ బీమా నమోదు చేయిస్తున్న వలంటీర్లు

వలంటీర్లకు ప్రశంసలు

జగ్గయ్యపేట: లబ్ధిదారుల చేత వైఎస్సార్‌ బీమా నమోదుకు మండలంలోని గౌరవరం గ్రామం నుంచి ముగ్గురు వలంటీర్లు హైదరాబాద్‌ వెళ్లిన ఘటన శనివారం జరిగింది. గ్రామానికి చెందిన 20 కుటుంబాల వారు కూలి పనుల నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం అర్హులందరికీ వైఎస్సార్‌ బీమా నమోదు చేయాలని ఆదేశించడంతో గ్రామంలోని వలంటీర్లు పెసరమల్లి శివాజీ, కనపర్తి గోపి, బూతుకూరి దుర్గారెడ్డి హైదరాబాద్‌కు వెళ్లి  20 కుటుంబాల యజమానుల పేర్లు వైఎస్సార్‌ బీమా పథకంలో నమోదు చేయించారు. దీంతో గ్రామస్తులు వలంటీర్లను అభినందించారు.  

మరిన్ని వార్తలు