APPSC Group 2: గ్రూప్‌-2 అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు మరో అవకాశం

19 Jun, 2022 10:42 IST|Sakshi

సాక్షి, అమరావతి: గ్రూప్‌–2 పోస్టుల భర్తీ కోసం గతంలో నిర్వహించిన పరీక్షలకు సంబంధించి కోర్టు ఆదేశాల ప్రకారం సవరించిన అర్హుల జాబితాలోని అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు మరో అవకాశం కల్పిస్తున్నట్టు ఏపీపీఎస్సీ శుక్రవారం తెలిపింది.
చదవండి: ఏపీ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌.. అడ్మిషన్ల షెడ్యూల్‌ ఇదే..

అప్పట్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన, బయోడేటా సమర్పణకు కొంతమంది హాజరు కాలేకపోయారని పేర్కొంది. వారు ఈ నెల 5న విజయవాడలోని కమిషన్‌ కార్యాలయంలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన, బయోడేటా వివరాల సమర్పణకు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరుకావాలని కోరింది. 

మరిన్ని వార్తలు