గ్రూప్- 1 మెయిన్స్ వాయిదా వేసిన ఏపీపీఎస్సీ

22 Oct, 2020 20:53 IST|Sakshi

సాక్షి, విజయవాడ : గ్రూప్‌-1 మెయిన్ ప‌రీక్ష‌ల‌ను ఏపీపీఎస్సీ వాయిదా వేసింది.  హైకోర్టు ఆదేశాల మేరకు పరీక్షలు వాయిదా వేస్తూ నిర్ణయించింది. వచ్చేనెల 2 తేదీ నుంచి 13 తేదీ వరకూ పరీక్షలు నిర్వహించేలా గతంలో షెడ్యూలు విడుదల చేసింది. అయితే తాజాగా హైకోర్టు ఆదేశాల మేర‌కు ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసింది.  పరీక్షల షెడ్యూలును ఈనెల 29వ తేదీన ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ  కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులు తెలిపారు. 
 

మరిన్ని వార్తలు