పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ రాత పరీక్షల షెడ్యూల్‌ ఇదే..

28 Oct, 2022 08:41 IST|Sakshi

సాక్షి, అమరావతి: వివిధ పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్షల షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ గురువారం ప్రకటించింది. ఈ పరీక్షల హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అభ్యర్థులకు సూచించింది. ఈ షెడ్యూల్‌ లోని పోస్టులన్నింటికీ జనరల్‌ స్టడీస్‌ మెంటల్‌ ఏబిలిటీ పరీక్ష నవంబర్‌ 7న జరగనుంది. అన్ని పోస్టులకు ఇది కామన్‌ పేపర్‌. 

దేవదాయ శాఖ ఈవో స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఫలితాలు
దేవదాయ శాఖ ఈవో స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. పరీక్ష రాసిన మొత్తం 52,915 మందికి గాను 1,278 మంది మెయిన్‌ పరీక్షకు ఎంపికయ్యారు.
    

మరిన్ని వార్తలు