భవిష్యత్తులో విభజనవాదం రాకూడదనే ఈ ఆలోచన : అవంతి

23 Jun, 2021 13:35 IST|Sakshi
మంత్రి అవంతి శ్రీనివాస్‌

సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఉద్దేశమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో పరిపాలన రాజధాని తరలింపు చట్ట ప్రకారమే జరుగుతుందని తెలిపారు.

అదే విధంగా, భవిష్యత్తులో విభజన వాదం తలెత్తకూడదనే ఈ ఆలోచన చేసినట్లు పేర్కొన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ విజన్‌ ఉన్న నాయకుడని కొనియాడారు. త్వరలో పరిపాలన రాజధానిగా విశాఖ అవుతుందని చెప్పారు. 

చదవండి: ఏపీ : ఐటీ పాలసీపై సీఎం వైస్ జగన్ సమీక్ష

మరిన్ని వార్తలు