బాబు బహుజనుల ద్రోహి

19 Jan, 2021 04:30 IST|Sakshi
దీక్షలలో పాల్గొన్న మహిళలు, దళిత సంఘాలు

మండిపడ్డ బహుజన పరిరక్షణ సమితి సంఘాలు

తాడికొండ: పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచి, ఆయన చావుకు కారకుడైన చంద్రబాబు ఇక బహుజనులకేం న్యాయం చేస్తాడని బహుజన పరిరక్షణ సమితి నాయకులు మండిపడ్డారు. తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు జంక్షన్‌లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 111వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల్లో పలువురు దళిత నాయకులు  ప్రసంగించారు. కుల పిచ్చితో చంద్రబాబు అమరావతి పేరిట చేస్తున్న దోపిడీకి ఎన్నికల్లో దళిత బహుజనులు ఓటు ద్వారా అడ్డుకట్ట వేయడంతో అధికారం కోల్పోయిన బాబు బహుజనులపై ద్వేషంతో హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తుండడం సిగ్గుమాలిన చర్య అన్నారు.

నందమూరి వంశాన్ని పతనం చేసి నారా వారి చేతుల్లోకి తీసుకున్న చంద్రబాబు ఎన్‌టీఆర్‌పై చెప్పులు వేయించి చనిపోవడానికి కారకుడయ్యాడని ఆరోపించారు. రాజధానిలో అంబేడ్కర్‌ విగ్రహం కడతానని బహుజనులను మోసం చేయడం ఒక ఎత్తయితే.. మామ ఎన్‌టీఆర్‌కు విగ్రహం అయినా పెడతాడని చూసిన 29 గ్రామాల రైతులు నేడు ఆయన చిత్రపటాలతో రోడ్లపై నివాళులర్పించాల్సిన దుస్థితి రావడం బాధాకరమన్నారు.  బాబు అండ్‌ కో కోర్టుల్లో వేసిన కేసుల్లో స్టేలను తొలగించేలా సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసి బహుజనులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. 

మరిన్ని వార్తలు