Balapur Laddu: సీఎం జగన్‌కు బాలాపూర్‌ లడ్డూ అందించిన ఎమ్మెల్సీ రమేశ్‌

21 Sep, 2021 18:53 IST|Sakshi

వేలంలో రూ.18.90 లక్షలకు దక్కించుకున్న ఎమ్మెల్సీ, శశాంక్‌ రెడ్డి

సాక్షి, అమరావతి: హైదరాబాద్‌ బాలాపూర్‌ లడ్డూను వేలం పాటలో సొంతం చేసుకున్న వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్‌ ఆ లడ్డూను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అందించారు. గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా బాలాపూర్‌లో నిర్వహించిన వేలంపాటలో ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్, నాదర్‌గుల్‌ నివాసి అబాకస్‌ విద్యాసంస్ధల అధినేత మర్రి శశాంక్‌ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. అత్యధికంగా రూ.18.90 లక్షలకు వారిద్దరూ లడ్డూను దక్కించుకున్న విషయం తెలిసిందే.

చదవండి: కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు.. రేవంత్‌కు కోర్టు ఆదేశం
చదవండి: ఒక్క మహిళా లేదు.. పురుషులతో నిండిన మంత్రివర్గం

మరిన్ని వార్తలు