ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించడానికే మూడు రాజధానుల బిల్లు వెనక్కి
త్వరలోనే సమగ్ర బిల్లును మళ్లీ సభ ముందుకు తెస్తాం
ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. సోమవారం ఉదయం సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అనంతరం రాజధాని వికేంద్రీకరణ ఉపసంహరణ బిల్లును ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ ప్రతిపాదనపై సభలో సీఎం మాట్లాడుతూ మరింత స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, సమతుల అభివృద్ధే ధ్యేయంగా వికేంద్రీకరణ బిల్లును మరింత సమగ్రంగా మళ్లీ సభ ముందుకు తెస్తామని స్పష్టం చేశారు. అంతకుముందు రాజధాని వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనానికీ ఈ విషయాన్ని ఏజీ శ్రీరామ్ వివరించారు.
మూడు రాజధానులకు సంబంధించి ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు, చట్టపరంగా, న్యాయపరంగా అన్ని సమాధానాలను బిల్లులోనే పొందుపరిచేందుకు, బిల్లును మరింత మెరుగుపరిచేందుకు, అన్ని ప్రాంతాలకు, అందరికీ విస్తృతంగా తెలియచేసేందుకు... ఇంకా ఏవైనా మార్పులు అవసరమైతే వాటిని కూడా జోడించేందుకు గతంలో ప్రవేశపెట్టిన బిల్లును వెనక్కి తీసుకుని అన్ని అంశాలతో పూర్తి, సమగ్రమైన, మెరుగైన బిల్లును త్వరలోనే మళ్లీ సభ ముందుకు తెస్తాం. రాష్ట్ర విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాం’’
అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాల ప్రజల ఆశలు, ఆకాంక్షలను ఈ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని వాటిని ఆవిష్కరించింది కాబట్టే రెండున్నరేళ్లుగా ఏ ఎన్నికల్ని తీసుకున్నా మనసారా దీవిస్తూ వచ్చారు’’ – అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడు ప్రాంతాల ప్రజల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకుని సమతుల అభివృధ్ధే లక్ష్యంగా వికేంద్రీకరణ బిల్లును సమగ్రంగా మళ్లీ సభ ముందుకు తెస్తామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రకటించారు. వికేంద్రీకరణ బిల్లును ఆమోదిం చిన వెంటనే మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమై ఉంటే ఈపాటికే సత్ఫలితాలు వచ్చి ఉండేవన్నారు. అందరికీ న్యాయం చేయాలన్న ప్రభుత్వ సదుద్దేశాన్ని పక్కన పెట్టి కొంతమందికి అన్యాయం జరుగుతోందనే వాదనను ముందుకు తెచ్చి కొందరు రకరకాల అపోహలు, అను మానాలు, న్యాయపరమైన చిక్కులు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వికేంద్రీకరణ బిల్లును ఉపసంహ రించుకోవడానికి దారి తీసిన పరిస్థితులను సోమవారం శాసనసభలో సీఎం జగన్ సోదాహరణంగా వివరించారు. కేంద్రీకరణ ధోరణులను నిరసిస్తూ హైదరాబాద్ లాంటి సూపర్ కేపిటల్ వద్దని 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు సుస్పష్టమైన చారిత్రక తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజల ఆకాంక్షల మేరకే వికేంద్రీకరణ వైపు అడుగులు వేశామని వివరించారు. రాష్ట్ర ప్రజల విస్తృత, విశాల ప్రయోజనాల కోసం వికేంద్రీకరణ బిల్లును సమగ్రంగా రూపొందించి మళ్లీ సభ ముందుకు తెస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో సీఎం జగన్ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ...
శ్రీకృష్ణ కమిటీ నివేదిక తుంగలోకి..
ప్రజలను తప్పుదోవ పట్టించడం ధర్మమేనా?
ఉద్యోగాల కోసం హైదరాబాద్ వెళ్లాల్సిందేనా?
అందరికీ మంచి జరగాలనే..
ఈ పరిస్థితుల మధ్య రెండేళ్లలో ఏమేం జరిగాయో మన కళ్లముందే చూస్తున్నాం. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకర ణను వక్రీకరిస్తూ అపోహలు, న్యాయపరమైన చిక్కులు సృష్టిస్తున్న నేపథ్యంలో నేను ఈ ప్రకటన చేయాల్సి వస్తోంది. శ్రీబాగ్ ఒడంబడిక స్ఫూర్తితో, వెనకబడ్డ ఉత్తరాంధ్ర సహా అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో వికేంద్రీకరణ బిల్లుల్ని ప్రవేశపెట్టాం.
ప్రజల తీర్పుకు అనుగుణంగానే వికేంద్రీకరణ..
గత సర్కారు అనుసరించిన కేంద్రీకృత ధోరణులను ప్రజలు ఎంతగా వ్యతిరేకించారో 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు ద్వారా ప్రస్ఫుటంగా వ్యక్త మైంది. మరోసారి హైదరాబాద్ లాంటి సూపర్ క్యాపిటల్ మోడల్ వద్దని, అలాంటి చారిత్రక తప్పి దానికి ప్రభుత్వం పాల్పడరాదని ప్రజాతీర్పు స్పష్టం చేసింది. కాబట్టే వికేంద్రీకరణే సరైన విధానమని బలంగా నమ్మి అడుగులు ముందుకు వేశాం.