ఇద్దరి ప్రాణాలు నిలబెట్టారు..

9 Apr, 2022 14:00 IST|Sakshi
కాలువలో పడ్డవారిని పైకి తీస్తున్న గ్రామస్తులు

కాలువలో పడ్డ ద్విచక్ర వాహనం

గుర్తించి ఇద్దరిని బయటకు లాగిన స్థానికులు

బొమ్మరాజుపల్లి వద్ద ఘటన 

ఈపూరు(పల్నాడు జిల్లా): మండలంలోని నెమలిపురికి చెందిన సాంబశివరావు, కోటేశ్వరరావులు బంధువులు. బొమ్మరాజుపల్లికి చెందిన వీరి బంధువు శేషారావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని చూసేందుకు వీరిద్దరు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు.

భద్రుపాలెం గ్రామసమీపంలోకి వచ్చేసరికి ద్విచక్రవాహనం అదుపు తప్పి నాగార్జున సాగర్‌ మెయిన్‌కెనాల్‌లో పడింది. స్పందించిన గ్రామస్తులు రక్షించారు. తాళ్ల సహాయంతో ఇద్దరిని పైకి లాగి వారిని ప్రాణాపాయం నుంచి కాపాడారు. అనంతరం ద్విచక్ర వాహనాన్ని కూడా తాళ్ల సాయంతో పైకి తీశారు. ఇద్దరి ప్రాణాలను కాపాడిన గ్రామస్తులను అధికారులు అభినందించారు.

మరిన్ని వార్తలు