సివిల్‌ సప్లయ్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి బాధ్యతలు

30 Jul, 2021 20:31 IST|Sakshi

సాక్షి, విజయవాడ: సివిల్‌ సప్లయ్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన భాస్కర్‌రెడ్డి.. మూడు దశాబ్దాల పాటు ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షునిగా పనిచేశారు. రైస్‌మిల్లింగ్‌ పరిశ్రమపై పూర్తి అవగాహన ఉన్న ఆయనకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక పదవిని అప్పగించారు. ఈ సందర్భంగా సీఎంకు ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని వార్తలు