పే..ద్ద నాగుపాముతో టీటీడీ ఉద్యోగి

11 Dec, 2021 10:09 IST|Sakshi

తిరుమల : అలిపిరి – తిరుమల నడకమార్గంలో శుక్రవారం నాగుపాము కలకలం రేపింది. టీటీడీ అటవీ ఉద్యో గి భాస్కర్‌ నాయుడు తెలిపిన వివరాలు.. అలిపిరి మెట్లదారిలోని 3400 మెట్టు వద్ద  ఓ పే..ద్ద నాగుపాము వచ్చినట్లు భక్తులు  చెప్పడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. బుసలు కొడుతున్న ఆ పామును చాకచక్యంగా పట్టుకుని అవ్వాచారికోనలో  వదిలేశారు.  

మరిన్ని వార్తలు