సాక్షి, అమరావతి: రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ బుధవారం నుంచి మూడు రోజులపాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. బుధవారం సాయంత్రం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో ఆయన భేటీ అవుతారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్లో గురువారం నిర్వహించే గవర్నర్ల సదస్సులో పాల్గొంటారు. శుక్రవారం సాయంత్రానికి విజయవాడ చేరుకుంటారని రాజ్భవన్ వర్గాలు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపాయి.