నేడు రెండేళ్ల పాలనపై పుస్తకం ఆవిష్కరణ

30 May, 2021 04:40 IST|Sakshi

క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించనున్న సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రెండేళ్ల పాలన పూర్తైన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు నివేదించనున్న అంశాలతో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ పుస్తకంలో మేనిఫెస్టోలో చెప్పినవాటితోపాటు చెప్పని అంశాలను కూడా ఈ రెండేళ్లలో ఎలా అమలు చేశారో వివరిస్తారు. అంతేకాకుండా ప్రజల దగ్గరకు ఆ పుస్తకాన్ని పంపించి.. అమలు తీరును పరిశీలించాల్సిందిగా కోరనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.   

మరిన్ని వార్తలు