బొత్సకు మాతృవియోగం

16 Aug, 2020 06:42 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తల్లి ఈశ్వరమ్మ(84) ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు.సుమారు గత నెల రోజులుగా ఆనారోగ్యంతో ఉన్న ఆమె విశాఖలోని పినాకిల్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమెకు ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు సంతానం. మంత్రి బొత్స సత్యనారాయణ పెద్ద కుమరుడు కాగా రెండో కుమారుడు బొత్స అప్పల నరసయ్య  ఎమ్మెల్యేగా ఉన్నారు. విజయనగరంలోని స్వర్గధామంలో ఆమె అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నాం నిర్వహించారు. మరోవైపు పలువురు వైఎస్సార్‌ సీపీ నేతలు ...బొత్స సత్యనారాయణను పరామర్శించి, సంతాపం తెలిపారు.

మరిన్ని వార్తలు