చెరువులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..

1 Nov, 2021 16:30 IST|Sakshi

విజయనగరం: విజయనగరం జిల్లాలో ఒక ఆర్టీసీ బస్సు అదుపుతప్పి చెరువులోకి దూసుకుపోయింది. దత్తిరాజేరు మండలం మారడాంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  ఈ ప్రమాదంలో ఎవరికి ప్రాణనష్టం జరగలేదు. కాగా, బస్సులో 79 మంది ప్రయాణికులున్నారు.

పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. బస్సు విజయనగరం నుంచి సాలూరు వైపుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని ఆర్టీసీ డ్రైవర్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు